ఆర్థిక సాయం అందజేత

Published: Wednesday July 20, 2022

ఇబ్రహీంపట్నం, జూలై 19 (ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని ఎడతెరపి లేకుండా
కురిసిన భారీ వర్షాల వలన మండలంలోని వివిధ గ్రామాలలో మొత్తం 73 ఇండ్లు పాక్షికంగా కూలడంతో ఇట్టి 73 మంది లబ్ధిదారులకు ఈరోజు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం కింద ఒక్కొక్కరికి 3,200/- రూపాయల చొప్పున మొత్తం 73 మందికి 2,33,600/- రూపాయలు ఎంపీపీ  జజలా భీమేశ్వరి, జడ్పిటిసి  కంఠం భారతి, తహశీల్దార్ మాహేశ్వర్, పంపిణీ చేశారు కార్యక్రమంలో ఆర్ఐ  భూమేశ్ ,కో ఆప్సన్ మెంబర్ చిన్న రెడ్డి , వివిధ గ్రామాల సర్పంచ్ లు,ఎంపీటీసీ లు,ఉప సర్పంచ్ లు, వీఆర్వో  రవి, కంఠం రమేష్ , జజలా జగన్ రావ్, జె.డి  సుమన్ మరియు వివిధ గ్రామాల వీఆర్ఏ లు లబ్దిదారులు పాల్గొన్నారు