బాలకృష్ణ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కార్పొరేటర్ కు వినతి మేడిపల్లి, నవంబర్ 20 (ప్రజాపాల
Published: Monday November 21, 2022
రామంతాపూర్ భగయత్ బాలకృష్ణ కాలనీలో త్రాగునీరు, రోడ్లు, కరెంట్, డ్రైనేజ్ తదితర మౌలిక వసతులు కల్పించాలని కాలనీవాసులు స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావుకు వినతి పత్రం అందజేశారు.
సమస్యల పైన స్పందించి కార్పొరేటర్ సంబంధిత అధికారులతో చర్చించి వీలైనంత తొందరలోనే అక్కడ నెలకొన్న సమస్యలను పూర్తి చేయిస్తానని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలనీవాసులు గొలుసుల స్వామి, కే స్వామి, పడిగం నగేష్, అల్లాడి నిరంజన్ గౌడ్, అడ్వకేట్ కృష్ణయ్య, జక్క పర్వతాలు, సోమేష్ కుమార్, పబ్బాల రామకృష్ణ, శ్యామ్, ఓంకార్, వెంకన్న, మహేష్, రమేష్, రాజేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.
Share this on your social network: