జిల్లాలో ప్రశాంతంగా ఎస్సై ప్రాథమిక పరీక్ష ** జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ **

Published: Monday August 08, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు 07(ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఎస్ఐ  ప్రాథమిక పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎస్పీ కె సురేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 6 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుండి, మధ్యాహ్నం 01 గంట వరకు నిర్వహించాలని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరీక్షలకు పోలీస్ నోడల్ అధికారి గా  అచ్చేశ్వర్ రావ్, రీజినల్ కోఆర్డినేటర్ గా శ్రీధర్ సుమన్, ప్రశ్నా పత్రాల పంపిణీ, బయోమెట్రిక్  హాజరు తదితర అంశాలను పర్యవేక్షించారు. జిల్లావ్యాప్తంగా 1492 మంది అభ్యర్థులకు గాను 1399 మంది హాజరయ్యారని. 99 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.93.7 శాతం మంది అభ్యర్థులు కాగా అందరూ అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ ఎస్ ఐ పరీక్షల నిర్వహణలో ఇద్దరు రూట్ అధికారులు, 6గుర పరిశీలకులు,12 మంది ఇన్విజిలేటర్లు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.