ప్రజాపాలన దినపత్రిక 2022 క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
Published: Monday January 10, 2022
మేడిపల్లి, జనవరి 9 (ప్రజాపాలన ప్రతినిధి) : ప్రజాపాలన జాతీయ తెలుగు దినపత్రిక 2022 నూతన క్యాలెండర్ ను ఆదివారం నాడు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ప్రజా సమస్యలను వెలికితీసి పరిష్కరించడంలో దిన పత్రికలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. అనాది కాలంలోనే ప్రజాపాలన జాతీయ తెలుగు దినపత్రిక అందరి మన్ననలను పొందిందని కొనియాడారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర రెడ్డి, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, ప్రజాపాలన రిపోర్టర్ నరోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: