కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో వైఎస్ఆర్ వర్థంతి
Published: Saturday September 03, 2022
జన్నారం, సెప్టెంబర్ 02, ప్రజాపాలన:
దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 13 వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల అద్యక్షులు బోర్లకుంట ప్రభుదాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలుకు శ్రీకారం చుట్టిన ఘనత వైఎస్ఆర్ దని తెలిపారు. ఆరోగ్యశ్రీ,108 లను ప్రవేశ పెట్టి ఎంతోమంది పేద ప్రజలకు ప్రాణదాతగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఫసీఉల్లా, ప్రచార కార్యదర్శి అజహర్, ఎస్సీ సెల్ అద్యక్షుడు మామిడి పెల్లి ఇందయ్య, సీనియర్ నాయకులు ముత్యం రాజన్న, దేవయ్య , నర్సింగ్ రావు, వార్డు మెంబర్ గంగన్న యాదవ్, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శులు ఇమ్రాన్, హేమంత్ చారి, పోచన్న, యువజన కాంగ్రెస్ నాయకులు మంద రాజేష్, ఆర్ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: