మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం : సంక్షేమ శాఖ మంత్రికొప్పుల ఈశ్వర్

Published: Sunday October 10, 2021
వెల్గటూర్, అక్టోబర్ 09 (ప్రజాపాలన ప్రతినిధి): వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన శేరి సుదర్శన్, శేరి రాజేందర్ ఒకే కుటుంబానికి ఇద్దరు అన్నదమ్ములు గత నెల హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారి, ఆదుకుంటామని మాట ఇచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇరువురు కుటుంబాలకు ఖర్చుల నిమిత్తం ఒక్కో కుటుంబానికి 50000 రూపాలను ఆర్థికంగా సహాయం శుక్రవారం రోజు నాయకుల ద్వారా అందించారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ పొడేటి సతీష్, సర్పంచ్ చల్లురి రూప, ఎంపీపీ కునమల్ల లక్ష్మీ లింగయ్య, జడ్పీటీసీ బి.సుధారాణి రామస్వామి, మాజీ సర్పంచ్ పోడేటి రవి గ్రామ శాఖ అధ్యక్షుడు తొగిటి ప్రభాకర్, అల్లం శంకరయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు.