భాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రగతి సాధించాలి
Published: Thursday January 20, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 19 జనవరి ప్రజాపాలన : భాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రగతి సాధించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హితవు పలికారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రవీంద్ర మండపంలో జడ్పీటీసీ ప్రమోదిని, ఎంపిపి కామిడి చంద్రకళ, వైస్ ఎంపిపి కొండి రాములు, ఎంపిడిఓ మలుగ సత్తయ్యలతో కలిసి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, అసంపూర్తిగా ఉన్న సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించి శీఘ్రంగా పనులు పూర్తయ్యే విధంగా కృషి చేయాలన్నారు. మండలంలో అసంపూర్తి దశలలో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖల అధికారులు తప్పకుండా హాజరు కావాలన్నారు. కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తలు వహించేలా అవగాహన కల్పిస్తూ, పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ నాగరాజు, మండల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, కో ఆప్షన్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: