ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 22ప్రజాపాలన ప్రతినిధి *ఇంటి స్థలాల కై --- రామోజీ ఫిలిం సిటీ ని ముట్ట
కమ్యూనిస్టు పార్టీ పోరాట ఫలితంగా 2007లో రామోజీ ఫిలిం సిటీలో సర్వే నెంబర్ 189 మరియు 203లో దాదాపు 600మందికి పైగా పేదలకు ఇంటి స్థలం సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ నేటికీ పోసిషన్ ఇవ్వడం లేదు. కాబట్టి రేపు 23వ తేదీ బుధవారం ఉదయం 9.00గంటలకు రాయపోల్ గ్రామం నుంచి పాదయాత్ర రామోజీ ఫిలిం సిటీ వరకు ఉంటుంది . కాబట్టి లబ్దిదారులు అందరూ ఈ పాదయాత్రలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. అలాగే రామోజీ ఆధీనంలో ఉన్న మిగతా ప్రభుత్వ భూమిని కూడా స్వాధీనం చేసుకుని పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేయాలి.
*ఈకార్యక్రమానికి:*
*జాన్ వెస్లీ (సీపీయం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)*
*కాడిగళ్ళ భాస్కర్ (సీపీయం జిల్లా కార్యదర్శి)*
*బి సామెల్ (సీపీయం జిల్లా కార్యవర్గ సభ్యులు)*
*సీహెచ్ జంగయ్య (సీపీయం మండల కార్యదర్శి)*
ఇతర ముఖ్య నాయకులు అందరూ పాల్గొంటున్నారు.
ఇంటి స్థలాల సాధనకై జరిగే ఈకార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని సిపిఎం మండల కార్యవర్గ సభ్యులు భూపోరాట కమిటీ సమన్వయకర్త పి జగన్ పిలుపునిస్తున్నాము.
Share this on your social network: