మొక్కలు నాటిన జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయన
Published: Tuesday July 06, 2021
బెల్లంపల్లి, జూలై 5, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి మండలం బూధకుర్డ్ గ్రామపంచా యతీలో పల్లె ప్రగతి లో భాగంగా సోమవారం నాడు మొక్కలు నాటిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తొంగల సత్యం నారాయణ. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ మొక్కలు నాటడం కాదు ప్రతి ఒక్కరు వాటిని సమ్ రక్షించుకోవాలని అప్పుడే భావితరాలకు ఉపయోగపడతాయని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఇంటికి 6 మొక్కలను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేముల కృష్ణమూర్తి, పల్లె ప్రగతి ప్రత్యేక అధికారి హరినాథ్ రెడ్డి, బెల్లంపల్లి ఎంపీడీవో రాజేందర్, ఎం పి ఓ, మరియు గ్రామ కార్యదర్శి దర్శి, వార్డు మెంబర్లు, పలువురు తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: