మొక్కలు నాటిన జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయన

Published: Tuesday July 06, 2021

బెల్లంపల్లి, జూలై 5, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి మండలం బూధకుర్డ్ గ్రామపంచా యతీలో పల్లె ప్రగతి లో భాగంగా సోమవారం నాడు మొక్కలు నాటిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తొంగల సత్యం నారాయణ. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ మొక్కలు నాటడం కాదు ప్రతి ఒక్కరు వాటిని సమ్ రక్షించుకోవాలని అప్పుడే భావితరాలకు ఉపయోగపడతాయని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఇంటికి 6 మొక్కలను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేముల కృష్ణమూర్తి, పల్లె ప్రగతి ప్రత్యేక అధికారి హరినాథ్ రెడ్డి, బెల్లంపల్లి ఎంపీడీవో రాజేందర్, ఎం పి ఓ, మరియు గ్రామ కార్యదర్శి దర్శి, వార్డు మెంబర్లు, పలువురు తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.