నేడే బట్టి విక్రమార్క, తాటిపర్తి జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు పర్యటన

Published: Friday February 12, 2021
రైతులతో ముఖాముఖి-మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  శైలేందర్ రెడ్డి
 
వెల్గటూర్, మార్చి 11 (ప్రజాపాలన): రైతులతో ముఖాముఖి మాట్లాడడానికి కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  శుక్రవారం రోజు వెల్గటూర్ మండలం రాజారాం పల్లె కు వస్తున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపర్తి శైలేంద్ర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలు ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించి దృష్ట్యా, సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధర కోసం, రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయడానికి రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి అభిప్రాయాలు, కష్టసుఖాలు సేకరించడానికి ప్రత్యేకంగా వస్తున్నట్లు శైలేందర్ రెడ్డి తెలియజేశారు.