వాటర్ ఛాలెంజ్ ఫర్ బర్డ్స్... పక్షులకు ఆహారం,నీరు.

Published: Thursday March 18, 2021

మంచిర్యాల టౌన్, మార్చి17, ప్రజాపాలన : మంచిర్యాల పట్టణంలో బుధవారం రోజున టిఆర్ఎస్ యువనాయకుడు నడిపెళ్లి విజిత్ ఆదేశాల మేరకు టి ఆర్ యస్ యువనాయ కుడు బింగి ప్రవీణ్ వాటర్ ఛాలెంజ్ ఫర్ బర్డ్స్ అనే కార్యక్రమం ని ప్రారంభించటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండ కాలం ప్రారంభమైన సందర్భంగా ఎన్నో పక్షులు ఎండ వేడికి తట్టుకోలేక నీరు ఆహారం లేక అలమటించి చనిపోవడం జరుగుతుందని, పక్షుల జాతి అంతరించి పోకుండా వాటర్ ఛాలెంజ్ ఫర్ బర్డ్స్  కార్యక్రమని ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఛాలెంజ్ ని ప్రతి ఒక్కరు స్వీకరించి, మీ మీ ఏరియాలో, మీ ప్రాంతంలో, ఇంటిపైన లేక ఇంటి గోడల పైన, చల్లని ప్రదేశంలో రెండు పాత్రల్లో ఒక దానిలో నీరు, మరొక దానిలో బియ్యం లేక ఆహార గింజలు పెట్టాలని కోరారు. ఇలా చేసినట్లు అయితే ఎన్నో రకాల జాతుల పక్షుల ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాము అని అన్నారు.