వధూవరులను ఆశీర్వదించిన దయానంద్, గణేశుల రవి

Published: Friday April 22, 2022
తల్లాడ, ఏప్రిల్ 21 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని పాత మిట్టపల్లి గ్రామానికి చెందిన కన్నెపోగు కృష్ణ కూతురు అనూష, గోపాలకృష్ణ దంపతుల వివాహం గురువారం గ్రామంలో జరిగింది. ఈ వివాహ వేడుకకు టిఆర్ఎస్ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుడు, స్థానిక నేత గణేశుల రవి హాజరై నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని దీవించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట గ్రామ సర్పంచ్ మాగంటి కృష్ణ, పోట్రూ శ్రీనివాసరావు, మువ్వా రోశయ్య, మువ్వా మల్లిఖార్జున్, మాగంటి శ్రీను, మాగంటి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.