సమ సమాజం నిర్మాణమే అంబేద్కర్ లక్ష్యం

Published: Wednesday December 07, 2022
కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్
వికారాబాద్ బ్యూరో 6 డిసెంబర్ ప్రజా పాలన : అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చుటకు కృషి చేద్దామని కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్ పిలుపునిచ్చారు. మంగళవారం కోటపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏఎంసి చైర్మన్ ఉప్పరి మహేందర్ మాట్లాడుతూ భారతదేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాల నెరవేర్చుటకు సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి దిక్సూచిగా ఉన్నారు. మనుషులంతా ఒక్కటే అనే నినాదంతో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కుల రహిత సమాజం ఏర్పడాలని ఆకాంక్షించారు. వారి ఆశయాలను నేటి సమాజం ఆచరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం అధ్యక్షులు ఆనంద్, మండల ప్రధాన కార్యదర్శి కుమ్మరి లాలప్ప, కోటపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, లింగంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు అనంతరెడ్డి, సీనియర్ నాయకులు సదానందం, ప్రధాన కార్యదర్శి సుశీల్ కుమార్, యువజన సంఘం అధ్యక్షులు మంగలి నాగేష్, దినేష్ కుమార్, రైతు సంఘం అధ్యక్షులు రత్నయ్య, మైనార్టీ సంఘం అధ్యక్షులు ఇస్మాయిల్, జి. నర్సింలు, మక్బూల్, శివకుమార్, ఏ. నరసింహులు, బందప్ప, పాండు, చిన్న, సూరి, బాలరాజ్, సాయి తదితరులు పాల్గొన్నారు.