పి ఆర్ సి బకాయిలు ఒకటే విడతలో జమ చేయాలి

Published: Wednesday August 11, 2021

కొడిమ్యాల, ఆగస్టు 10 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని వివిధ పాఠశాలలో  మంగళవారం రోజున తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) సభ్యత్వ నమోదు జరిగింది. అనంతరం తపస్ జిల్లా అధ్యక్షులు  వొడ్నాల రాజశేఖర్ మాట్లాడుతూ పి ఆర్ సి బకాయిలను మొత్తం ఒకటే సారి విడుదల చేయాలని, ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు వచ్చే విధంగా చూడాలని, కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, టీచర్లకు బదిలీలు ,ప్రమోషన్లు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఆయిల్ నేని  నరేందర్ రావు, జిల్లా బాధ్యులు నాంపల్లి మల్లేశం, ఏనుగు ఆదిరెడ్డి, గోనేపల్లి శ్రీనివాస్, మండల అధ్యక్షులు గుడి భూపతి రెడ్డి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఎన్నమనేని అశోక్ రావు, ఉపాధ్యాయులు బొమ్మ సురేష్, తదితరులు, పాల్గొన్నారు.