లాక్ డౌన్ ను పర్యవేక్షిస్తున్న సర్పంచ్ రాజిరెడ్డి

Published: Thursday May 13, 2021
పరిగి, 12 ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా, దోమ మండల కేంద్రంలో సర్పంచ్ కె రాజిరెడ్డి పోలీస్ లతో కలిసి బుధవారం లాక్ డౌన్ ను పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యాపార సముదాయలు హోటల్లను తెరువనియరాదని సూచించారు. వ్యవసాయ సీజన్ కనుక రైతులను ఇబ్బందులు పెట్టొద్దని చెప్పారు. మండల కేంద్రం కనుక ఆసుపత్రి. మండల కార్యాలయాలకు వొచ్చే వారి పనిని బట్టి అనుమతి ఇచ్చే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.