వచ్చే ఎన్నికల్లో మధిర గడ్డ పై గులాబీ జెండా ఎగరవేస్తాం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ

Published: Wednesday April 19, 2023

బోనకల్, ఏప్రిల్ 18 ప్రజా పాలన ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో మధిర గడ్డపై గులాబీ జెండా ఎగరవేస్తామని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు చేరుతున్నాయని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం నాడు బొనకల్ మండలం జానికిపురం గ్రామం నందు జడ్పీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన బొనకల్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని యావత్ దేశం మొత్తం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. బోనకల్ మండల అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తాం అన్నారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో అభివృద్ది చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. సమావేశం అనంతరం కార్యకర్తలకు స్వయంగా పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కు భోజనాలు ఒడ్డించి మీడియా మిత్రులతో కలిసి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు, మండల కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, మాజీ మండల అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ, రావినూతల సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, బీఆర్ఎస్ నాయకులు ఇటుకల శ్రీనివాసరావు, తమ్మారపు బ్రహ్మయ్య, పారా ప్రసాద్, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ సైదా, వెనిగండ్ల మురళి, తన్నీరు పుల్లయ్య, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.