ప్రధానిని అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీనీ భూస్థాపితం చేస్తాం

Published: Tuesday January 11, 2022
ఇబ్రహింపట్నం నియోజకవర్గం  జనవరి 10 ప్రజాపాలన ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇటీవల భారత ప్రధాని పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం పంజాబ్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది ప్రధాని నరేంద్ర మోదీ కి ఆయురారోగ్యాలతో ఉండాలని తుర్కయంజాల్ శ్రీరాం నగర్ లో ఉన్న శ్రీసీతారామాంజనేయ  స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అనంతరం బిజెపి తుర్కయంజాల్ డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ వద్ద మూతికి నల్ల బట్టలు కట్టుకొని నిరసన దీక్ష చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కోశాధికారి శ్రీ కొత్త రాంరెడ్డి మరియు బీజేపీ ఎస్సిమోర్చా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బచ్చిగళ్ల రమేష్ మాట్లాడుతు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ నరేంద్ర మోదీ విషయంలో పంజాబ్ కాంగ్రెస్ ఖలిస్తాన్ ఉగ్రవాదులతో కలిసి ఆయనను ఓ 20 నిమిషాలు నిర్బంధించి ఇబ్బంది పెట్టడాన్ని మొత్తం భారత జాతికి జరిగిన అవమానంగా భావించాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు ప్రధాని కి ఎలాంటి హాని కలిగిన భారత ప్రజలు చూస్తూ ఉరుకోరని వారన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నల్లవెళ్లి నిరంజన్ రెడ్డి, నోముల కార్తిక్ బిజేవైయం రాష్ట్ర ఫొటోకాల్ కోకన్వీనర్ రాష్ట్ర నాయకులు సానేం అర్జున్ గౌడ్ పలుస శ్రవణ్ కుమార్ గౌడ్, జిల్లా నాయకులు జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు శ్రీమతి తూల్ల వసంత మల్లెల ప్రేమ్ సాయి జిల్లా బి జే వై యం అధికార ప్రతినిధి జిల్లా ఎస్సిమోర్చా ప్రధానకార్యదర్శి పొడిచెర్ల ప్రకాష్ మున్సిపాలిటీ బిజెపి ప్రధాన కార్యదర్శులు యంజాల శ్రీనివాస్ రెడ్డి, మాధు శ్రీకాంత్ రెడ్డి, మహిళమోర్చా మున్సిపాలిటీ అధ్యక్షురాలు శ్రీమతి మారగౌని సునీత ఎస్సిమోర్చా నాయకులు కంచనాని దాస్, యాదయ్య, ఈర్లపల్లి బాబు యువమోర్చా నాయకులు నిట్టు శివ తదితరులు పాల్గొన్నారు.