ఓంఅష్టోత్తర యోగా పీఠ్ నూతన కమిటీని ఏర్పాటు.

Published: Monday June 28, 2021

మంచిర్యాల జిల్లా ప్రతినిధి, జూన్ 26, ప్రజాపాలన. ఓంఅష్టోత్తర యోగా పీఠ్ పాత కమిటీ రద్దు చేస్తూ ఆదివారం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. ఈ నూతన కమిటీలో గౌరవ అధ్యక్షుడుగా గుండా విజయకుమార్, అధ్యక్షుడుగా ముక్త వేణుగోపాల్, ప్రధానకార్యద ర్శిగా కొత్త కాళేశ్వర్, ఉపాధ్యక్షుడుగా కోడూరి శ్రీనివాస్, కోశాధికారిగా మల్యాల శ్రీపతి, జాయింట్ సెక్రటరీగా బియ్యాల సతీశ్ రావు, ప్రచార కార్యదర్శిగా కోలేటి రవి గార్లను. అలాగే ప్రత్యేక వ్యాఖ్యాతగా సిరంగి గోపాల్ గార్లను ఎన్నుకోవడం జరిగినదని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా.. నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ యోగాతో కలిగే ఉపయోగాలు ప్రజల్లోకి తీసుకువెల్తూ ఓం అష్టోత్తర యోగా పీఠ్ ను అభివృద్ధి ప్రదంలో నడిపిస్తూ జిల్లా, రాష్ట్రంవ్యాప్తంగా గుర్తింపుతో పలు యోగా కార్యక్రమాలు నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిజేశారు.