కొత్త రేషన్ కార్డు ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మల్లుభట్టి విక్రమార్క

Published: Tuesday July 27, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి 27వ తేదీ మున్సిపాలిటీ ఈ రోజు మధిర ఆర్యవైశ్య కళ్యాణమండపం లో జరిగిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మధిర శాసన సభ్యులు clp లీడర్ మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ హస్తం పేరుతో బియ్యంతో పాటు 9 రకాల వస్తువులను రేషన్ కార్డు లబ్దిదారులకు అందించామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మిగులు బడ్జెట్, అధిక రాబడి ఉన్న రాష్ట్రంలో అప్పుడిచ్చిన 9 రకాల వస్తువులను రేషన్ నుంచి తొలగించి కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. ధనిక రాష్ట్రంలో అంతకుముందు ఇచ్చిన 9 వస్తువులకు అదనంగా మరోరెండో, మూడో వస్తువులు కలిపి ఇవ్వాలి కానీ.. ఉన్నవి తొలంగించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రంలో పేదపక్షానప్రతిపక్షనాయకుడిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా.. రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డు లబ్దిదారులకు బియ్యంతో పాటు 9 రకాల వస్తువులను తిరిగి అందించాలని అన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న మిగిలిన రేషన్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు, మండల sc సెల్ అధ్యక్షుడు దారా బాలరాజు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి,సర్పంచ్ పులిబండ్ల చిట్టిబాబు, మండల intuc అధ్యక్షుడు కోరంపల్లి చంటి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవి కుమార్, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్, ముస్లిం వెల్ఫేయిర్ కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అలీ, మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు, బొమ్మకంటి హరిబాబు చిలువేరు బుచ్చి రామయ్య, మువ్వా వెంకయ్యబాబు, నిడమనూరు వంశీ రామిశెట్టి సత్యనార