కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శులకు సన్మానం

Published: Friday September 02, 2022

జన్నారం, సెప్టెంబర్ 01, ప్రజాపాలన: కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో మండల కేంద్రానికి చెందిన హేమంత్ చారి, సయ్యద్ ఇమ్రాన్ లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యదర్శులుగా ఎన్నికైన సందర్భంగా వారిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోర్లకుంటా ప్రబూదస్ గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల కార్యకర్తలను గుర్తించి రాష్ట్ర స్థాయిలో పదవులు రావడం సంతోషంగా ఉందన్నారు. పార్టీలో కష్టపడ్డ వారికి తప్పకుండా న్యాయం జరుగు తుందనడానికి ఇదే నిదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోర్లాకుంట ప్రభుదాస్, ప్రధానకార్యదర్శి ఫసీ ఉల్లా, ఉపాధ్యక్షులు అంబడిపెల్లి మహేష్, కార్యదర్శి బానవత్ తిరుపతి, బీసీ సెల్ అధ్యక్షులు భినవేని రాజన్న, వార్డు సభ్యులు భినవేని గంగన్న, నాయకులు నర్సింగరావు, రమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు మంద రాజేష్, గొర్రె మహేష్ యాదవ్, తదతరులు పాల్గొన్నారు.

అదేవిధంగా విఅర్ఎల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని ఎఐసిసి రిసెర్చ్ డిపార్ట్మెంట్ రాష్ట్ర కో ఆర్డినేటర్ వినోద్ నాయక్ అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా జన్నారం తాహసిల్థార్ కార్యాలయం ఆవరణలో, విఅర్ఎలు చేపట్టిన నిరవధిక సమ్మె 39 రోజులు గడిచిన విఅర్ఎలు సమస్యలు పరిష్కరించకుండ పోవడం ప్రభుత్వం ఉండడం సరికాదన్నారు. విఅర్ఎల సమస్యలు ఇప్పటికైనా ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యాక్రమంలో జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.