హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి

Published: Wednesday February 24, 2021
రాయికల్, ఫిబ్రవరి 23(ప్రజాపాలన ప్రతినిధి): హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ వార్షికోత్సవాన్ని రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామంలో ఉన్న కస్తూర్భా ఆశ్రమ పాఠశాలలో మంగళవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మండల పరిషత్ అధ్యక్షురాలు లావుడ్యా సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు విద్యా పరంగా, నిరుద్యోగ యువతకు వృత్తి శిక్షణ పరంగా, అనాధలకు, అభాగ్యులకు మేమున్నాము అంటూ గత  సంవత్సరాలుగా ఎన్నో వెల కట్టలేని సేవా కార్యక్రమాలు నిర్వహించిన హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ కి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.మన మండలంలో ఈ పాఠశాల బాలికల విద్యాభివృద్ధి కోసం డిజిటల్ క్లాస్ ల కొరకై కంప్యూటర్ సిస్టమ్,పవర్ ఇన్వెర్టర్, హై మాస్ లైట్స్, హాస్టల్ అవసరాల కోసం, వెట్ గ్రైండర్, స్పోర్ట్స్ కీట్స్, ఆడపిల్లలకు ప్రత్యేక కీట్స్ మా చేతుల మీదుగా పంపిణీ చేస్తున్నందుకు చాల సంతోషంగా ఉందన్నారు. ఇంత మంచి కార్యక్రమం మామండలంలో ఏర్పాటు చేసిన హాప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ఫౌండర్ సోదరి హిమజరెడ్డికి వివిధ దాత మహాశయులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు అందరూ చాలా చక్కగా చదువుకొని బంగారు భవిష్యత్తు బాటలు వేసుకోవాలని అందుకు మా వంతుగా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.డీ.ఓ రమేష్, ఎం. ఈ. ఓ గంగాధర్, ఎం.పి.ఓ శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ కైరి ముత్తయ్య, కో ఆప్షన్ మొఖిద్, భూపతిపూర్ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, ఆశ్రమ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ శోభ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు మరియు టి.ఆర్.ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు .