గణిత టాలెంట్ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన శివనందిని

Published: Thursday December 29, 2022
జన్నారం, డిసెంబర్ 28, ప్రజాపాలన: హైదరాబాద్ లో నిర్వహించిన గణిత టాలెంట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు ప్రభుత్వ పాఠశాల కు చెందిన పదవ తరగతి విద్యార్థిని కే శివ నందిని ఇంగ్లీష్ మీడియం విభాగంలో రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానం సాధించడం జరిగిందని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాడి ప్రభాకర్ అన్నారు. బుధవారం ప్రతిభ కనబరిచిన పాఠశాల విద్యార్థిని స్థానిక పాఠశాల గైడ్ టీచర్ ఎం తిరుపతి, ప్రధానోపాధ్యాయులు జాడి గంగాధర్, ఉపాధ్యాయుల బృందం, ఎస్ఎంఎస్ చైర్మన్, స్థానిక సర్పంచ్, గ్రామస్తులు
అభినందించారు