అన్ని దానాల కన్నా అన్నదానం మీన్నమధిర

Published: Monday January 16, 2023
 జనవరి 14 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శనివారం నాడుశ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి  దేవాలయం వర్తక సంగం లో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ప్రతి శనివారం అ న్న గోవిందం జరుగును. ఈరోజు అన్నదానం దాతలు శ్రీమాన్ నాళ్ళ శ్రీనివాసరావు ధర్మపత్ని లక్ష్మి, శ్రీమాన్ పుల్ల ఖండం చంద్రశేఖర్ ధర్మపత్ని పద్మావతి, శ్రీ మాన్ కొల్ల శ్రీనివాసరావు ధర్మపత్ని పద్మావతి కీర్తిశేషులు కాకరపర్తి నాగభూషణం  జ్ఞాపకార్థం వారి కుమారుడు-కోడలు కాకరపర్తి శ్రీనివాసరావు ధర్మపత్ని శ్రీదేవి, శ్రీమాన్ రాయపాటి నాగేశ్వరరావు ధర్మపత్ని పుష్పావతి, శ్రీమాన్ వేములపల్లి హరి శివ మణికంఠ తాత వేములపల్లి మల్లికార్జునరావు, శ్రీమాన్ పర్వతం నాగేశ్వరరావు ధర్మపత్ని శ్రీలత, కుమార్తె: ఆవని  వారి ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహకులు ప్రారంభించారు ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ ఈరోజు శనివారం సందర్భంగా అన్నదానం చేయటం అన్ని దానాలు కన్నా అన్నదానం మిన్న అని అన్నం పరబ్రహ్మ స్వరూపిణి అన్నదానం చేయటం ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు అందరికీ ఉండాలని వారు చెప్పారు ఈ కార్యక్రమంలో కపిలవాయి జగన్మోహన్రావు, వెచ్చా శ్రీనివాసరావు, నాళ్ళ శ్రీనివాసరావు, కాకరపర్తి శ్రీనివాసరావు,కొల్లా శ్రీనివాసరావు, మల్లికార్జున రావు, యార్లగడ్డ రమేష్, తదితరులు మరియు  కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు*