ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయా
Published: Monday September 13, 2021
బోనకల్, సెప్టెంబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఖమ్మం జిల్లా కన్వీనర్ మరియు ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన సమితి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీటింగ్లో గౌరవ అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గత ఎన్నికల సమయంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం 1000 కోట్లతో నిధులు ఏర్పాటు చేస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంత వరకు ఆర్యవైశ్య కార్పొరేషన్ కొరకు ఇచ్చిన హామీని అమలుపరిచలేదు తక్షణమే ఆర్యవైశ్య కార్పొరేషన్ కొరకు నిధులు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ సాధన సమితి అధ్యక్షులు మునగాల కాంతారావు,ఖమ్మం జిల్లా కన్వీనర్ కుంచం కృష్ణారావు, నంబూరు మురళీ కృష్ణ అన్నారు. అనంతరం కార్యక్రమంలో ఖమ్మం పట్టణ కన్వనర్ (సహాయ కార్యదర్శి) గా తుమ్మలపూడి శ్రీనివాసరావు, బోనకల్ మండలం కన్వీనర్ గా చవట మధును నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బచ్చు వెంకటేశ్వరరావు, తుమ్మలపూడి శ్రీనివాసరావు, గుర్రం నరేష్, గుర్రం వెంకటేశ్వరరావు, గెల్లా ఉదయ్ కుమార్, కలవల లక్ష్మీనారాయణ, రంగా జనార్ధన్, మిరియాల రవికుమార్, పులఖండం వెంకటేశ్వర్లు, పళ్ళ పోతుల గోపి, రంగా హనుమంతు రావు పాల్గొన్నారు.
Share this on your social network: