బెల్లంపల్లిలో స్వచ్ఛంద లాక్ డౌన్

Published: Monday May 03, 2021

బెల్లంపల్లి మే 2, ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల విషయమై పట్టణంలోని షాపులో సమయాన్ని మారుతున్నట్లు మున్సిపల్ వైస్ చైర్మెన్ బి.సుదర్శన్ తెలిపారు. ఆదివారం నాడు స్థానిక ఆర్య వైశ్య కళ్యాణ మండపం లో ఏర్పాటుచేసిన వర్తక, వాణిజ్య, వ్యాపార, సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల తో తీసుకున్న నిర్ణయం మేరకు ఈనెల 4వ తేదీ మంగళవారం నుండి 11వ తేదీ మంగళవారం వరకు వారం రోజుల పాటు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే అన్ని షాపులు తెరిచి ఉంటాయని ముఖ్యంగా బెల్లంపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు గమనించి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో. మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జక్కులశ్వేత శ్రీధర్, గెళ్ళి రాజలింగు, రేణి కుంట్ల శ్రీనివాస్, రాజు లాల్ యాదవ్, బడికెల రమేష్, పోలుశ్రీనివాస్, బండి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.