ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Published: Thursday April 28, 2022
మేడిపల్లి, ఏప్రిల్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) : టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ మరియు 22వ డివిజన్లలో స్థానిక కార్పొరేటర్లు బొమ్మక్ సుగుణ బాలయ్య, దొంతరబోయిన మహేశ్వరి కృపసాగర్ ముదిరాజ్ లు ఘనంగా నిర్వహించారు. ఈమేరకు కార్పొరేటర్లు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఆయా డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులతో కలిసి డివిజన్లలోని రాజశేఖర్ కాలనీ, ఈదయ్య నగర్, వెస్ట్ బాలాజీ హిల్స్, న్యూ హేమ నగర్ తదితర కాలనీలలో టీఆర్ఎస్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ల అధ్యక్షులు వెల్లంకి శ్రీనివాస్ రావు, పోకల రవీందర్ ముదిరాజ్, కమిటీల సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Share this on your social network: