జోడో యాత్ర లో పాల్గొన టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణ రావు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ
Published: Tuesday November 08, 2022
కోరుట్ల, నవంబర్ 07 (ప్రజాపాలన ప్రతినిధి):
పేద ప్రజల కోసం రాహుల్ గాంధీ చేస్తున్న జోడో పాదయాత్ర లో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు. టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణ రావు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి యాత్ర లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర తో దేశంలో పెను మార్పులు రావడం ఖాయం అని అన్నారు.జోడో యాత్ర లో మెటుపల్లి బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి , కోరుట్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అద్యక్షుడు ఏలేటి మహిపల్ రెడ్డి, పైడిమడుగు గ్రామ అధ్యక్షుడు జనార్ధన్,ఇబ్రహీంపట్నం మండల నాయకులు భాస్కర్ రెడ్డి, కోరుట్ల మండల యువజన కాంగ్రెస్ అద్యక్షుడు పన్నాల అంజిరెడ్డి, మెటుపల్లి పట్టణ మండల అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్, అక్కపెళ్లి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: