ఎంపీ అరవింద్ పై దాడిని ఖండిస్తున్నాం

Published: Friday January 28, 2022

బిజేపి మండల అధ్యక్షుడు గోలి చందు

జన్నారం రూరల్, జనవరి 27, ప్రజాపాలన : ఎంపీ దర్మపురి అరవింద్ పై టిఆర్ ఎస్ శ్రేణులు చేసిన దాడిని ఖండిస్తున్నామని మండల బిజేపి పార్టీ అధ్యక్షుడు గోలి చందు అన్నారు. గురువారం ఆ పార్టీ జిల్లా కమిటీ పిలుపు మేరకు ఎంపి పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ తల్లి విగ్రహం ముందర మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అయన  మాట్లాడుతూ బీజేపీ ఎదుగుదల ను జీర్ణించుకోలేక అదికార పార్టీ నాయకులు భౌతిక దాడులకు దిగుతున్నారని విమర్శించారు. దాడులు చేస్తే బయపడేది లేదని వచ్చే ఎన్నికల్లో ప్రజలు టిఆర్ ఎస్ కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గోలి చందు, ప్రధాన కార్యదర్శి ఎరుకల రమేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు రాగుల సూర్యం,  నాయకులు వీరచారి, జక్కుల సురేష్, భద్రినాయక్, బెడద గోపాల్, చిట్టిబాబు, శివ నిఖిల్ రావు, సాయం లక్మాన్, శ్రీకారం లక్మాన్, తదితరులు పాలోగన్నారు.