ఎర్రుపాలెం జులై 26 ప్రజాపాలన ప్రతినిధి మండలంలో రెండో రోజు కొనసాగుతున్న వీఆర్ఏల నిరవధిక సమ్మె

Published: Wednesday July 27, 2022
ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్  2020 సెప్టెంబర్ 9వ తారీఖున కొత్త రెవెన్యూ చట్టం అమలు చేస్తున్నప్పుడు వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని, అర్హులైన వారికి ప్రమోషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ రెండు సంవత్సరములు గడుస్తున్నా నేటి వరకు అమలు చేయని ప్రభుత్వం. వివిధ దశల్లో కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు, కలెక్టరేట్ ముట్టడి చేసి ఉన్నాము. అయినా ప్రభుత్వం వీఆర్ఏలకు పే స్కేల్ వర్తింప చేయలేదు. దానిని అనుసరించి రాష్ట్ర వీఆర్ఏల జేఏసీ కమిటీ పిలుపుమేరకు ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెను నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి వీఆర్ఏలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎర్రుపాలె మండలం వీఆర్ఏలు పాల్గొన్నారు.