తాడికల్ లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే శంకరపట్నం ఫిబ్రవరి 26 ప్రజాపాలన రిపోర
Published: Monday February 27, 2023
శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో క్రికెట్ యూత్ నిర్వహిస్తున్న సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ ను మానకొండూరు శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ ప్రారంబించారు. ఈ సందర్భంగా యువకులతో ఉత్సాహంగా క్రికెట్ ఆడుతూ ఆయన చదువుకునే రోజులను గుర్తు చేసుకున్నాడు. యువకులు ఉత్సాహంగా ఉండాలంటే ఆటలు చాలా ముఖ్యమని శారీరక శ్రమ అవసరమని ఆయన అన్నారు. అయన వెంట జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మైపాల్ తధితరులు పాల్గొన్నారు.
Share this on your social network: