కాంగ్రెస్ పార్టీ మరింత ప్రతిష్ట చేస్తాం : మాజీ ఎంపీపీ మర్రి నిరంజన్ రెడ్డి
Published: Thursday September 09, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 8, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మర్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన టిఆర్ఎస్ యువకులు, మంచాల మండల్ అంబోత్ తండాకు చెందిన 12 మంది టిఆర్ఎస్ పార్టీ క్రియాశీల కార్యకర్తలు నిరంజన్ రెడ్డి సేవా కార్యక్రమాలు మరియు అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరారు, నిత్యం ప్రజల్లో ఉంటూ, ఆపద సమయాలలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అనునిత్యం ప్రజా సేవే లక్ష్యంగా ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున అన్నారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని పార్టీలో చేరిన సందర్భంగా యువకులు తెలిపారు, అనంతరం మర్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల సంక్షేమం లక్ష్యంగా నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలందరికీ సేవ చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన యువకులు ఆంబోతు హరి నాయక్, మోహన్ నాయక్, కుమార్, బిక్షపతి, వేణు, రాజ్ కుమార్, సురేష్, వెంకటేష్, ప్రవీణ్, సుధాకర్, హరి తదితరులున్నారు.
Share this on your social network: