మాస్క్, శానిటైజర్ పంపిణి చేసిన బీజేపీ నాయకులు

Published: Monday May 31, 2021
పఠాన్చేరు, మే 30, ప్రజాపాలన ప్రతినిధి : రామచంద్రపురం పట్టణంలోని ఎస్.యన్ కాలనీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి రవి కుర్మ ఆధ్వర్యంలో ముఖ్య అతిధిగా జిల్లా బీజేపీ కార్యదర్శి మహేందర్ రెడ్డి హాజరై శానిటైజర్, మాస్క్ పంపిణి చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది దీని ప్రతి ఒకరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కరోనా దృశ్య ప్రతి ఒకరు మాస్క్, శానిటైజర్ బౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.