తాతా మదు కలిసిన అభినందనలు తెలియజేసిన నేలకొండపల్లి తెరాస మండల నాయకులు..

Published: Friday January 21, 2022
పాలేరు జనవరి 20 ప్రజాపాలన ప్రతినిధి : ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతా మధు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన నేలకొండపల్లి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వున్నం బ్రహ్మయ్య, ఆధ్వర్యంలో మండల తెరాస నాయకులు హైదరాబాద్ లో తాతా మధుని కలిసారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆయనకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్సీ నిధులను జిల్లాకు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేయాలని కోరారు. తాతా మధు ను కలిసిన వారిలో డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, నేలకొండపల్లి రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శాఖమూరి సతీష్, సొసైటీ చైర్మన్ కోటి సైదారెడ్డి, నేలకొండపల్లి సర్పంచుల సంఘం అధ్యక్షులు గండు సతీష్, జిల్లా నాయకులు మరికంటి రేణుబాబు, వజ్జా శ్రీనివాసరావు ఉన్నారు.