కొండ లక్ష్మణ్ బాపూజీ పదవ వర్ధంతి

Published: Thursday September 22, 2022
మహబూబ్నగర్ (డిస్ట్రిక్ట్) నవాబు పేట్(మండల్)  సెప్టెంబర్21 ప్రజా (పాలన ప్రతినిధి.) మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కొండ లక్ష్మణ్ బాపూజీ పదవ వర్ధంతి ని పద్మశాలి మండల అధ్యక్షుడు లింగం ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగిల్ విండో చైర్మన్ మాడేమో నర్సింహులు. సర్పంచ్ గోపాల్ గౌడ్ మండల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మెండే లక్ష్మయ్య. మాడెమోని నరసింహులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కొండ లక్ష్మణ్ బాపూజీ ఎన్నో ఉద్యమాలు చేశాడన్నారు 1969 ఢిల్లీలో తన మంత్రి పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి వ్యక్తి మన కొండ లక్ష్మణ్ బాపూజీ అన్న అన్నారు అలాగే 1969 నవంబర్ 1  నుంచి 2012 నవంబర్ 1 ప్రతి సంవత్సరం  నవంబర్ 1న  40  సంవత్సరాల పాటు తన తెలంగాణ పోరాటం కోసం నిరాహార చేసిన వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు పద్మశాలిల కోసం జాతీయస్థాయిలో సంఘాన్ని ఏర్పాటు చేశారు  పేద చేనేత విద్యార్థుల కోసం హాస్టల్ భవనాన్ని ఏర్పాటు చేశాడు చేనేత కార్మికులకు అండగా ఉంటానని నర్సింలు అన్నాడు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శీను. పండర్నాథ్. సురేష్. పెంటయ్య. యాదగిరి. మాజీ సర్పంచ్ నర్సింలు. మాజీ ఎంపిటిసి రమేష్. ఆంజనేయులు. నర్సింలు. చౌడూర్ ఆంజనేయులు. శ్రీరామ్ నరేష్. శ్రీరామ్ వెంకటేష్. బాలరాజ్. స్వామి. ఆనంద్. సత్యం. కొండయ్య. పద్మశాలి కుల బాంధవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు