రేగా ఆధ్వర్యంలో అభివృద్ధిలో దూసుకుపోతున్న పినపాక నియోజకవర్గం మణుగూరు జడ్పిటిసి పోషం నరసిం

Published: Friday December 16, 2022
 పినపాక నియోజకవర్గం లోని మణుగూరు అశ్వాపురం బూర్గంపాడు మండలాల్లో పారిశ్రామిక అభివృద్ధి అత్యంత వేగవంతంగా జరుగుతుందని అందుకు ప్రధాన కారణం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు కృషి పట్టుదల ప్రధాన కారణమని మణుగూరు జడ్పిటిసి శ్రీ పోశం నరసింహారావు అన్నారు గురువారం నాడు పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యంత వేగవంతంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్న ఈ ప్రాంతంలో పాలిటెక్నిక్ కళాశాల మంజూరు కావడం సర్వత్ర ప్రజలు  హర్షనీయం అభినందనీయం అన్నారు అందుకు ప్రధాన భూమిక పోషించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావుకి పినపాక నియోజకవర్గం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు .ఇప్పటికే భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మించడం ద్వారా వేలాదిమంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా సంతోషం అన్నారు. మణుగూరు కేంద్రంగా పాలిటెక్నిక్ కళాశాల మంజూరు కావడం భవిష్యత్తు పారిశ్రామిక విద్యపై ప్రత్యేక కేంద్రీకరణ ఉద్యోగ ఉపాధి అవకాశాలపై చాలా ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు .ఈ సమావేశంలో బి ఆర్ ఎస్ మండల పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు ,అడపా అప్పారావు, ఎంపీపీ కారం విజయ కుమారి ,సొసైటీ అధ్యక్షులు కురి నాగేశ్వరరావు రైతు సమన్వయ కమిటీ చైర్మన్ రామసాని వెంకట్ రెడ్డిల బి ఆర్ ఎస్ మండల పట్టణ ప్రధాన కార్యదర్శులు రామిడి రామిరెడ్డి, బొలిశెట్టి నవీన్ మరియు నాయకులు ఎడ్ల శ్రీనివాస్ తాతారమణ ఆవుల నరసింహరావు వేముల లక్ష్మయ్య కవిత రమాదేవి చంద్రకళ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .