ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి
Published: Tuesday May 17, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 16 మే ప్రజా పాలన :
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత తహసీల్దార్లను ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల స్వీకరణలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీ దారుల నుండి వివిధ సమస్యలపై 170 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని వారు తెలిపారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలుగకుండా భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కొన్ని సమస్యలకు ఆప్షన్స్ రాలేదని వచ్చిన వెంటనే పరిష్కరించడం జరుగుతుందని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్, తాండూర్ రెవిన్యూ డివిజన్ అధికారులు విజయ కుమారి, అశోక్ కుమార్,ల్యాండ్ సర్వే ఏడి రాంరెడ్డి, ఏఓ హరిత అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: