శ్రీనిధి పాఠశాలలో క్రిస్టమస్ వేడుకలు మధిర రూరల్
Published: Saturday December 24, 2022
డిసెంబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో ఆత్కూర్ గ్రామంలో శుక్రవారం నాడు శ్రీనిధి* పాఠశాలలో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బి. అంజన్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యేసు క్రీస్తు బోధనలు అందరూ ఆచరించదగినవని సర్వమానవాళి సోదరభావంతో శాంతి సౌబ్రాతృత్వంతో మెలగాలని, క్రీస్తు సందేశంలో సారాంశమనీ, ఈ సారాంశంను అన్నికులమతాలు ఏసుక్రీస్తు ప్రార్థనలు చేసి క్రిస్మస్్ పండగను .ఆచరించాలని కోరారు, ఈ కార్యక్రమంలో విద్యార్థుల వివిధ వేషధారణలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ బి.శ్రీనివాసరావు, డైరెక్టర్లు చందు, వెంకటనారాయణ, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Share this on your social network: