మాజీ మేయర్ రవీందర్ సింగ్ పై కక్షసాధింపు చర్యలు తగవు : సర్దార్ ఇందర్ సింగ్.
Published: Saturday December 18, 2021
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి) : మంత్రి గంగుల కమలాకర్ తన పదవిని దుర్వినియోగం చేస్తూ మాజీ మేయర్ రవీందర్ సింగ్ పై కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు కేంద్ర గురుద్వార సాహెబ్ గౌలిగూడ శాఖ అధ్యక్షుడు సర్దార్ ఇందర్ సింగ్. కక్ష్యసాధింపు చర్యలలో భాగంగా 20 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ఆయన ఇంటిని కూల్చివేయడం అన్యాయం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలయిన సిక్కు సోదరులకు ఏకైక లీడర్ రవీందర్ సింగ్ అని, అతనికి ఎం ఎల్ సి ఇస్తామని మోసం చేయడం వల్లనే ఆయన బాధతో పోటీ చేశాడన్నారు. మైనారిటీ సిక్కుల పై కక్ష్య పూరిత చర్యలకు పాల్పడడం తగదన్నారు.
Share this on your social network: