మృతిచెందిన మల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి నేతలు

Published: Thursday July 01, 2021
బాలపూర్ (ప్రతినిధి) ప్రజాపాలన : మృతిచెందిన మల్లమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఉన్నటువంటి బాలపూర్ లో అనారోగ్యంతో మృతి చెందిన కందుకూరి మల్లమ్మ మృతదేహానికి నివాళులు అర్పించిన మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ అనంతరం ఆయన మాట్లాడుతూ..... (మల్లమ్మ) ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కార్యవర్గ సభ్యులతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు నివాళులు అర్పించిన వారిలో బీజేపీ సీనియర్ నాయకులు కొలన్ శంకర్ రెడ్డి, బడంగ్ పేట కార్పొరేషన్ జీఎస్ జోరాల ప్రభాకర్, దొడ్డి శ్రీశైలం, గుండె నాగార్జున సహా బీజేపీ నాయకులు పాల్గొన్నారు.