విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. - తపస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బండి రమేష్ దండేపెల్
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బండి రమేష్ డిమాండ్ చేశారు. గురువారం దండేపల్లి మండలంలోని పలు పాఠశాలల్లో టిపియుఎస్ సభ్యత్వ నమోదు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు అనేక సంవత్సరాలుగా పదోన్నతులు లేకుండా ఒకే క్యాడర్లోనే రిటైర్ అయిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే పదోన్నతులు , బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే పాఠశాలకు తప్పనిసరిగా అవసరం ఉన్న స్కావెంజర్లను తొలగించడం దారుణం అని అన్నారు. తొలగించిన స్కావెంజర్లను ప్రభుత్వం వెంటనే నియమించాలని కోరారు. అలాగే వివిధ రకాల పెండింగ్ బిల్లులను కాలయాపన లేకుండా తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తపస్ జిల్లా ఉపాధ్యక్షులు నీలేష్ కుమార్, మండల నాయకులు ఉప్పల రూపాచారి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: