ఉచిత స్కూల్ డ్రెస్సులు పంపిణి

Published: Tuesday September 20, 2022

కొడిమ్యాల, సెప్టెంబర్ 19 (ప్రజాపాలన ప్రతినిధి):
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని సండ్రాళ్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సోమవారం రోజున ప్రభుత్వం నుండి వచ్చిన ఉచిత స్కూల్ డ్రెస్సులను ప్రజాప్రతినిధులు పంపిణి చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఈసారి స్కూల్ డ్రెస్సులు ప్రైవేట్ కు దీటుగా ప్రవేశ పెట్టిందని చెబుతూ,ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మన ఊరు, మన బడి కార్యక్రమం ను దాతల సహాయం తో ముందే అమలు చేసారని అన్నారు. అందుకొరకే ప్రభుత్వం సెప్టెంబర్ 5 న ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందజేసినదని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీటీసి బసన వేని మహేష్, ఉపసర్పంచ్ పెంకాసుల లక్ష్మి,మాజీ ఎంపిటిసి గంగుల మల్లేష్ యాదవ్,విద్యా కమిటీ చైర్మన్ ఇట్నవేణి మహేందర్,నాయకులు పెంకా సుల మల్లయ్య, యూత్ సభ్యులు ఒడ్నాల సాయి, ఐలపురం సాయి కృష్ణ, పెంకా సుల అబిలాష్, బోడిగే తిరుమల్, తునికి పవన్, తై దల చందు, విద్యార్థులు పాల్గొన్నారు.