వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్న బిజెపి నాయకులు

Published: Thursday May 19, 2022

మేడ్చల్ జిల్లా (ప్రజాపాలన) : జవహార్ నగర్ లో దాదాపు 6 సంవత్సరాలుగా ప్రధాన రహదారి  విషయంలో శిలాఫలకాలకే పరిమితమైన అధికార  టిఆర్ఎస్ నాయకులు, అధికారులు.ఇకనైనా కళ్ళు తెరచి 100 ఫీట్ల రోడ్డు వెంటనే పూర్తి చేయాలని.. నిరసనగా మంత్రి మల్లారెడ్డి, మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ ల  దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది2017లో జవహర్ నగర్ ప్రధాన రహదారి వేస్తామని ని టిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి గారు వేసిన శిలాఫలకం. ఇప్పుడు 2021లో జవహర్ నగర్ ప్రధాన రహదారి వెస్తామని సంవత్సరం కింద శిలాఫలకం వేసిన మంత్రి మల్లారెడ్డి.కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. నోరు తెరిస్తే 25 కోట్లు, 50 కోట్లు అని చెప్పడమే తప్ప ఇప్పటికీ శిధిలావస్థకు చేరుకున్న శిలా ఫలకం మరియు జవహర్ నగర్ ప్రధాన రహదారి. రోడ్డుపై ఎన్ని యాక్సిడెంట్లు జరిగినా దుమ్ము ధూళితో ప్రజలు వాహనదారులు, దుకాణదారులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని మంత్రి మల్లారెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు.. నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్న జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.