ప్రధాని మంత్రి మోడీకి పాలాభిషేకం

Published: Wednesday June 09, 2021

బొల్లారం, జూన్ 08, ప్రజాపాలన ప్రతినిధి : బొల్లారం మున్సిపల్ ప్రాంతంలో బీజేపీ నాయకుడు ఆనంద్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మంత్రి నరేంద్రమోడీకి ఘనంగా పాలాభిషేకం చేశారు. ఆనంద్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశంలో పేద ప్రజలకు ఈ నెల నుండి దీపావళి వరకు ఉచిత రేషన్ బియ్యం, దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టనునందుగాను కృతజ్ఞతగా మోడీకి పాలాభిషేకం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో 22 వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్, మాజీ వార్డు సభ్యులు శారదమ్మ బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు