నేటి నుండినాలుగు రోజులు విద్యుత్ సరఫరాలో అంతరాయం మధిర రూరల్

Published: Tuesday December 13, 2022

డిసెంబర్ 12ప్రజా పాలన ప్రతినిధి నియోజకవర్గ పరిధిలో విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి మేరకు వినియోగదారులు నాలుగు రోజులు విద్యుత్తు సరఫరా తో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ వారి తెలిపారుపెద్దగోపతి నుండి మధిర 132 కెవి సబ్ స్టేషన్ వరకు జరుగుతున్న నూతన విద్యుత్ టవర్ల నిర్మాణ పనులలో భాగంగా  నేటినుండి అనగా 13, 14, 15, 16 తేదీలలో నాలుగు రోజులపాటు మధిర ,ఎర్రుపాలెం, బోనకల్లు మండలాలకు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5:00 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. అదేవిధంగా పగటిపూట విద్యుత్ సరఫరా నిలిపివేయబడుచుండుటవలన వ్యవసాయ పంట పొలాలకు నీటి సరఫరాలో రైతులకు ఇబ్బంది తలెత్తకుండా  వ్యవసాయ మోటార్లకు  రాత్రి 10 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు విద్యుత్ సరఫరా చేయబడునని,  కావున వినియోగదారులు సహకరించవలసినదిగా విద్యుత్ శాఖ మధిర సబ్ డివిజన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ శ్రీమతి ఎం. అనురాధ  కోరుచున్నారు.