మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు
Published: Monday February 20, 2023
రాయికల్ ,ఫిబ్రవరి 19 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ పట్టణంలోని గుడికోట శ్రీ చెన్నకేశవనాథ ఆలయంలో స్వామి (త్రికూట ఆలయం)వారిని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలుచేశారు. ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హనుమాండ్లు, ఇంతియాజ్,జెడ్పీటీసీ అశ్విని జాదవ్, కౌన్సిలర్లు ,కోఆప్షన్ సభ్యులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: