టిఆర్ఎస్ పార్టీ హయాంలోనే మున్సిపాలిటీ అభివృధ్దిలింగాల కమల్ రాజు

Published: Saturday August 06, 2022
 మధిర రూరల్ఆగస్టు 5 ప్రజా పాలన ప్రతినిధి శుక్రవారం నాడుమున్సిపల్ చైర్మన్ మొండితోక లత గారితో కలసి డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా  మున్సిపాలిటీలో పలు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ సెంటర్, భరత్ డిగ్రీ కళాశాల ప్రాంతంలో కాలిన నకన నడిచి డ్రైనేజీ, నీటి తొట్లు పరిశీలించి క్రిమిసంహారకముందును పిచికారి చేపించారుఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్  పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా డ్రైడే ఫ్రైడే కార్యక్రమం ప్రతి సంవత్సరం చేపట్టే విధంగా ఈ సంవత్సరం కూడా చేపట్టడం జరిగిందని, ప్రజలందరూ వర్షాకాలం కనుక నీటి తొట్లు, కొబ్బరి బొండాలు, పాత టైర్లు పరిసర ప్రాంతాలలో లేకుండా శుభ్రంగా ఉండాలని లేని పక్షంలో సీజనల్ వ్యాధులు బారిన పడవలసి వస్తుందని, మున్సిపల్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండి అన్ని వార్డులను ఎప్పటికప్పుడు తిరుగుతూ ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే శుభ్రం చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు.
 ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్  మొండితోక లత కమిషనర్ రమాదేవి మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరావు సొసైటీ అధ్యక్షులు బిక్కి ప్రసాద్ నరేందర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఆరి శ్రీనివాస్ అప్పారావు కౌన్సిలర్ మాధవి మున్సిపల్్ సిబ్బంది టిఆర్ఎస్్ల్ మండల అధ్యక్షుడు రావూరిి శ్రీనివాస్ జీవి రెడ్డి వార్డ్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు