బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
Published: Friday December 30, 2022
డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 29 డిసెంబర్ ప్రజాపాలన : దోమ మండలం దిర్సంపల్లి తండాకు చెందిన నేనావత్ శంకర్ మరణించడంతో అంత్యక్రియల నిమిత్తం మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశామని డిసిసిబి చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మరణ వార్త తెలియగానే డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి తాను అందుబాటులో లేకపోవడంతో తన అనుచరులతో బాధిత కుటుంబానికి రూ.5,000 లు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హన్మంత్, బల్ రామ్, సోమ్లా నాయక్, గోపాల్, రాములు యువకులు తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: