అడ్మిషన్లకు చివరి తేదీ డిసెంబర్ 6

Published: Friday November 26, 2021
యాదాద్రి నవంబర్ 25 వలిగొండ ప్రజా ప్రతినిధులు మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వరా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓపెన్ టెన్త్ ఇంటర్ లో 2021-22 విద్యా సంవత్సరంలో ప్రవేశమునకు డిసెంబర్ 6వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించినట్లు, 10వ తరగతికి 100 రూపాయలు, ఇంటర్ 200 రూపాయల అపరాధ రుసుము చెల్లించవలసి ఉంటుందని,మండలంలో మధ్యలో విద్యను మానేసిన వారందరూ వయసుతో సంబంధం లేకుండా ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలి సిందిగా శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వలిగొండ అసిస్టెంట్ కోఆర్డినేటర్ ఐ గోపి ఎస్ ఏ ని సంప్రదించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఒక ప్రకటనలో తెలిపారు.