రక్తాదానం చేయండి ప్రాణాలను కాపాడండి ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మేడిపల్లి, సెప్టెంబర్2 (ప్ర
Published: Saturday September 03, 2022
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడ్డానికి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి సూచించారు.
ఉప్పల్ డివిజన్లోని సరస్వతికాలనీలోని శ్రీ రత్న ఫిజియోథెరఫీ కాలేజీ, ఇండియన్ రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంకు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొని స్థానిక కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి, బోడుప్పల్ కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్ తో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.రక్తదానం చేయడంతో కలిగే ప్రయోజనాలను గురించి ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుభాష్రెడ్డి ,రజితపరమేశ్వర్రెడ్డి వివరించారు. ఈ కాలేజీలో ఉచితంగా ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నామని కాలేజ్ కరస్పాండెంట్ శ్రీనివాాస్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రత్న కాలేజ్ ఆఫ్ సైకాలజీ ప్రిన్సిపల్ ప్రసన్న, వైస్ ప్రిన్సిపల్ మేరీ, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి, అరటికాయల భాస్కర్ ముదిరాజ్ , లేతాకుల రఘుపతి రెడ్డి, గరిక సుధాకర్, ఉప్పల్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేముల సంతోష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మస్కా సుధాకర్ , టిఆర్ఎస్ నాయకులు పంగ మహేందర్ రెడ్డి యాదగిరి రెడ్డి, శ్రీనివాస్ , నాగిరెడ్డి,సరస్వతి కాలనీ అధ్యక్షులు చెర్ల సుధాకర్ రెడ్డి , కాలేజీ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: