గ్రామంలో విద్యుత్ సమస్యను పరిష్కరించిన సర్పంచ్

Published: Tuesday October 25, 2022
 జన్నారం, అక్టోబర్ 23, ప్రజాపాలన: మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో విద్యుత్ సమస్యతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు చెందుతున్నారని, ఆ గ్రామ సర్పంచ్ జాడి గంగాధర్ పరిష్కరించడం జరిగిందని అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామం పంచాయతీ పరిధిలో ఇటీవల టాక్టర్ విద్యుత్ స్తంభాన్ని అదుపుతప్పి ఢీకొట్టడంతో విద్యుత్ స్తంభం విరిగిపోయిందని, స్థానిక గ్రామంలో విద్యుత్ సమస్య తలెత్తడంతో ఆ గ్రామ సర్పంచ్  విద్యుత్ అధికారుల సహకారంతో నూతన స్తంభాన్ని వేయించి గ్రామ ప్రజల విద్యుత్ సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్ గ్రామస్తులు సర్పంచును అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, గ్రామస్తులు  తదితరులు, పాల్గొన్నారు.